News January 28, 2025
జాతీయస్థాయి పోటీలకు జైపూర్ విద్యార్థిని

జైపూర్ మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సంజన జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. పాఠశాల HM శ్యాంసుందర్, PDగోపాల్ మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల క్రికెట్ పోటీల్లో సంజన అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. జాతీయస్థాయి పోటీలు ఫిబ్రవరి 3నుంచి 9వరకు హరియాణాలో జరుగుతాయన్నారు.
Similar News
News November 10, 2025
సమస్యలు వాట్సప్ చేయండి.. పార్లమెంట్లో ప్రశ్నిస్తా: MP

ఏలూరు జిల్లాలో సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమస్యలను 9618194377, 9885519299 ఈ నెంబర్లకు వాట్సాప్ చేయాలంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యలను పరిశీలించి పార్లమెంటులో ప్రశ్నిస్తానని చెప్పారు. ప్రశ్నలు పంపిన వారిని పార్లమెంట్కు ఆహ్వానించి ఒకరోజు విజిటర్స్ గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తానని చెప్పారు.
News November 10, 2025
కుక్కల నియంత్రణపై మేయర్ సమీక్ష

గ్రేటర్ వరంగల్ నగరంలోని జన సంచార ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉండకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వీధి కుక్కల నియంత్రణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి పాల్గొని సమర్థవంతం గా నిర్వహించుటకు మేయర్ సూచనలు చేశారు.
News November 10, 2025
SDPT: రైతులకు కలెక్టర్లు అండగా ఉండాలి: మంత్రి

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జిల్లా కలెక్టర్లు అండగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వసతుల కల్పనపై సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలసి ఆయా శాఖల ఉన్నత అధికారులతో కలిసి, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


