News January 28, 2025
జాతీయస్థాయి పోటీలకు జైపూర్ విద్యార్థిని

జైపూర్ మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సంజన జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. పాఠశాల HM శ్యాంసుందర్, PDగోపాల్ మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల క్రికెట్ పోటీల్లో సంజన అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. జాతీయస్థాయి పోటీలు ఫిబ్రవరి 3నుంచి 9వరకు హరియాణాలో జరుగుతాయన్నారు.
Similar News
News February 7, 2025
KNR: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
News February 7, 2025
మెదక్: అప్పుడే మండుతున్న ఎండలు

గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి తొలి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. పొద్దున, సాయంత్రం చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట ఎండలు సుర్రుమంటున్నాయి.
News February 7, 2025
MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

మహబూబ్నగర్ జిల్లా న్యూ <<1538043>>టౌన్ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి అతివేగంగా, ఆజాగ్రత్తగా బైక్ నడపడమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.