News March 24, 2025

జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ

image

జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ రవీందర్ ఎంపికయ్యాడు. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం జాతీయస్థాయి యోగా రిఫరీ డిప్లొమా పరీక్షలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 130 మంది పాల్గొనగా భైంసా ఇలేగాం వాసి అయిన రవీందర్ పాల్గొని ఉత్తీర్ణత సాధించాడు. యోగా అసోసియేషన్ ఛైర్మన్ అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

Similar News

News November 26, 2025

26/11: మానవత్వం చాటుకున్న రతన్ టాటా!

image

ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా ఆర్మీ అధికారులకు అందించిన సపోర్ట్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన 3 రోజులు తాజ్ హోటల్ వెలుపలే నిలబడి సహాయక చర్యల్లో భాగమై మానవత్వాన్ని చాటారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆస్తినష్టం జరిగినా పర్లేదని ఆర్మీని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, బాధితుల కుటుంబాలకు ఆయన చికిత్స అందించి ఆర్థికంగా కూడా మద్దతుగా నిలిచారు.

News November 26, 2025

ఎఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్) అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ సునీతతో కలిసి ఆయన నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్ల ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు.

News November 26, 2025

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అంబేడ్కర్ స్మృతి వనం: జడ శ్రవణ్

image

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని సందర్శించి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా స్మృతి వనం అధ్వానంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆయన మండిపడ్డారు. విగ్రహం ధ్వంసం అయ్యేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.స్మృతి వనం పరిరక్షణకు, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.