News March 24, 2025
జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ

జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ రవీందర్ ఎంపికయ్యాడు. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం జాతీయస్థాయి యోగా రిఫరీ డిప్లొమా పరీక్షలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 130 మంది పాల్గొనగా భైంసా ఇలేగాం వాసి అయిన రవీందర్ పాల్గొని ఉత్తీర్ణత సాధించాడు. యోగా అసోసియేషన్ ఛైర్మన్ అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
Similar News
News November 26, 2025
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

సీఎం చంద్రబాబు నాయుడు వచ్చేనెల 1న ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను SP ప్రతాప్ శివ కిషోర్ బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు DSP శ్రావణ్ కుమార్తో కలిసి హెలిపాడ్ ప్రాంతం, పార్కింగ్ ప్రాంతాలు, సభా ప్రాంతం, పర్యటనా ప్రాంతాలను పరిశీలించారు.
News November 26, 2025
తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News November 26, 2025
కదిరిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

కదిరి టౌన్లోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ పక్కన చింతచెట్ల కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అతని ఒంటిపై తెలుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉంది. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 94407 96851కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.


