News March 25, 2025
జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చారా?

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పోషకాహార లక్ష్యాల సాధనలో జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్పు ఎంతవరకు సహాయపడుతుందని ప్రశ్నించారు. సాంప్రదాయ రకాల పంటలు, తృణధాన్యాలు, మినుములలో విత్తన లభ్యతను పెంపొందించడంలో ఈ పథకం ఎంత వరకు సహాయ పడుతుందో తెలియజేయాలన్నారు.
Similar News
News April 1, 2025
అనంతసాగరం: ఈతకెళ్లి యువకుడి మృతి

ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన అనంతసాగరం మండలంలో మంగళవారం జరిగింది. అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ బాష (21) సోమశిల ఉత్తర కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News April 1, 2025
కాకాణి నేడు విచారణకు హాజరవుతారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయనకు నోటీసులు అందజేసేందుకు పోలీసులు పొదలకూరు, హైదరాబాదుకు వెళ్లినా అందుబాటులో లేరు.ఇవాళ ఉ.11గంటలకు నెల్లూరు DSP ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా APR 18కి విచారణ వాయిదా పడింది. దీంతో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్గా మారింది.
News April 1, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.