News February 8, 2025
జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి జిల్లా వాసి

కామారెడ్డి జిల్లా రక్త దాతల సమూహ అధ్యక్షుడు జమీల్ సాయి సేవ భగవాన్ జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైనట్లు రక్త దాతల ఫౌండర్ డా.బాలు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో ఈ పురస్కారాన్ని జమీల్ అందుకొనున్నారు.
Similar News
News February 9, 2026
GNT: ప్రపంచ కప్ విజేత అనురాధకు శాప్ ఛైర్మన్ సత్కారం

షూటింగ్ బాల్ ప్రపంచ కప్ విజేత పి.అనురాధ రెడ్డిని శాప్ SAAP ఛైర్మన్ రవీనాయుడు సోమవారం సత్కరించారు. ఢిల్లీలో జరిగిన 2వ ప్రపంచ కప్ పోటీల్లో ఆమె భారత్ తరపున బంగారు పతకం సాధించారు. బాపట్ల జిల్లాకు చెందిన అనురాధ.. ఛైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచినందుకు రవినాయుడు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
News February 9, 2026
మిడ్నైట్ క్రేవింగ్స్కి కారణం ఇదే..

కడుపునిండా తిన్నా కూడా కొందరికి అర్ధరాత్రి ఆకలివేస్తూ ఉంటుంది. పడుకోలేక దొరికిన స్నాక్స్ తినేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్రెలిన్ హార్మోన్ పెరగడం, ఒత్తిడి, డైటింగ్, కొన్నిరకాల మందులు వాడటం వల్ల క్రేవింగ్స్ వస్తాయి. డిన్నర్లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గుతాయి. లేదంటే డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
News February 9, 2026
కామారెడ్డి: ముగిసిన మున్సిపల్ ప్రచారం.. 11న పోలింగ్

కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారాలను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. 9వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు, అలాగే 13న కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


