News February 8, 2025
జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి జిల్లా వాసి

కామారెడ్డి జిల్లా రక్త దాతల సమూహ అధ్యక్షుడు జమీల్ సాయి సేవ భగవాన్ జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైనట్లు రక్త దాతల ఫౌండర్ డా.బాలు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో ఈ పురస్కారాన్ని జమీల్ అందుకొనున్నారు.
Similar News
News March 19, 2025
రాత్రికి రాత్రే YSR పేరు తొలగించారు: వైసీపీ

AP: విశాఖపట్నంలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయికి చేరిందని వైసీపీ ఆరోపించింది. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న YSR పేరును టీడీపీ నేతలు తొలగించారు. రాత్రికి రాత్రే డా.వైఎస్సార్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్లోని లాన్కు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు’ అని Xలో ఫొటోలు పోస్ట్ చేసింది.
News March 19, 2025
వికారాబాద్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ రేణుకాదేవి తెలిపారు. ఏలాంటి ఇబ్బందులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08416 235245కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు.
News March 19, 2025
పాకిస్థాన్లో చైనా ఆర్మీ..!

పాకిస్థాన్లో ఆర్మీ, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించేలా చైనా ఒప్పందం చేసుకుంది. సీపెక్ ప్రాజెక్టులోని చైనా కార్మికులని, ఇంజినీర్లను కాపాడేందుకు వీలుగా ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో డ్రాగన్ దేశానికి చెందిన పలు భద్రతా ఏజెన్సీలు పాక్లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తాయి. పాక్లో బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.