News January 19, 2025

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే

image

ఇటీవల జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమించబడిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లే గంగారెడ్డిని ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తకు బీజేపీలో గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే పల్లె గంగారెడ్డి అన్నారు.

Similar News

News December 1, 2025

పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

image

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్‌లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్‌గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.

News December 1, 2025

42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

image

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

News December 1, 2025

అసలేంటీ ‘బ్లాక్ ఫ్రైడే’ ?

image

1960ల్లో ఫిలడెల్ఫియాలో మొదలైన బ్లాక్ ఫ్రైడే ప్రస్తుతం భారతీయులకు షాపింగ్ ఫెస్టివల్‌ అయింది. మన క్యాలెండర్, కల్చర్‌లో లేని దానిని గ్లోబలైజేషన్, ఇన్‌ఫ్లూయెన్సర్లు, సోషల్ మీడియా.. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (FOMO) అంటూ అలవాటు చేసేశాయి. డిస్కౌంట్‌కు నో చెప్పడానికి భారతీయులు ఇష్టపడరు. అదే రూ.వేల కోట్ల వ్యాపారానికి కేంద్రబిందువైంది. గ్లోబల్ బ్రాండ్స్ మొదలెట్టిన ఈ ట్రెండ్‌ను ఇంటర్నెట్ వైరల్ చేసేసింది.