News January 19, 2025

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే

image

ఇటీవల జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమించబడిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లే గంగారెడ్డిని ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తకు బీజేపీలో గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే పల్లె గంగారెడ్డి అన్నారు.

Similar News

News November 28, 2025

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి: హరీశ్ రావు

image

వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు కాపాడే వృత్తిలో అక్రమ మార్కులతో పాసై ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై, సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News November 28, 2025

బాపట్ల: వికటించిన నాటువైద్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి

image

మేడికొండూరు(M) పేరేచర్లలో ఇంటర్ విద్యార్థిని(16) నాటువైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న బాలికకు, స్థానికుల సలహాతో ‘కొండపిండి ఆకు’ తినిపించారు. నాటు మందు కారణంగా కడుపునొప్పి తీవ్రమవ్వడంతో వెంటనే గుంటూరు GGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున బాలిక మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 28, 2025

జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

image

జపాన్‌తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.