News April 22, 2025
జాతీయ పోటీలకు ఎంపికైన ధర్మారం మండల విద్యార్థిని

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని రేవెల్లి శిరీష జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరపున ఆమె పాల్గొననుంది. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు శిరీషను అభినందిస్తున్నారు.
Similar News
News April 23, 2025
ఇంటర్లో ఫెయిల్.. సివిల్స్లో ర్యాంకర్

UPSC తుది ఫలితాల్లో తిరుపతి జిల్లా వాసి సత్తా చాటాడు. నారాయణవనం(M) గోవిందప్ప కండ్రిగ వాసి సురేశ్ సివిల్స్లో 988 ర్యాంకుతో అదరగొట్టారు. ఇంటర్లో ఫెయిల్ అయిన ఆయన.. సివిల్స్లో సత్తా చాటడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. 2017 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయన తాజాగా అనుకున్నది సాధించారు.
News April 23, 2025
పెరవలి – మార్టేరు రోడ్డులో రాకపోకలు బంద్

పెరవలి – మార్టేరు రోడ్డులో నెగ్గిపూడి నుంచి పెనుగొండ వరకు R&B రహదారి పనులు జరుగుతున్నాయి. ఈనెల 25 నుంచి జూన్ 25 వరకు నిలిపివేయనున్నట్లు R&B AE ప్రసాద్ తెలిపారు. నెగ్గిపూడిలో రహదారి నిర్మాణం, పెనుగొండలో వంతెన పనులు జరుగుతున్నాయన్నారు. మార్టేరు టు రావులపాలెం వెళ్లే వాహనాలను మార్టేరు,ఆచంట, సిద్ధాంత మీదుగా, మార్టేరు – తణుకుకు వెళ్లే వాహనాలు మార్టేరు, ఆలుమూరు, ఇరగవరం మీదుగా మళ్లించనున్నారు.
News April 23, 2025
అమరావతి: ఒకప్పటి ధాన్యకటకం గురించి తెలుసా..?

అమరావతి ప్రాచీనంగా ధాన్యకటకం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో(సా.శ. 1వ శతాబ్దం) ఈప్రాంతం బౌద్ధ, జైన మతాలకు ప్రముఖ కేంద్రంగా మారింది. బౌద్ధ విశ్వవిద్యాలయం, బౌద్ధరామాలు, స్థూపాలు అమరావతిని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. శాతవాహన పాలకులు దీన్ని రాజధానిగా వాడారు. బౌద్ధుడి కాలచక్ర బోధనలకు కేంద్రంగా అమరావతి నిలిచింది. వజ్రయాన గ్రంథాల్లో అమరావతికి చారిత్రక ప్రామాణికత ఉంది.