News March 23, 2025
జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సిద్దిపేట- ఎల్కతుర్తి మార్గంలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై జాతీయ రహదారుల శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు.
Similar News
News December 5, 2025
MBNR: ఎన్నికల వేళ… జోరందుకున్న దావత్లు!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు, వినోద కార్యక్రమాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పల్లెల్లో నేతలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.
News December 5, 2025
ఉమ్మడి జిల్లా HMలతో ITDA ఇన్ఛార్జ్ PO సమావేశం

మెనూ అమలు బాధ్యత HMలదేనని ITDA ఇన్ఛార్జ్ PO యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల HMలు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లతో ఉట్నూర్లో సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 5, 2025
కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోండి: ఎంపీ

జిల్లాలో కొబ్బరి రైతులను ఆదుకోవాలని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ శుక్రవారం పార్లమెంటులో కోరారు. జిల్లాలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కొబ్బరి పంట వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు జీవనోపాధిని నిలబెట్టే సాంస్కృతిక, ఆర్థిక ఆధారాలని ఎంపీ తెలిపారు.


