News September 15, 2024

జాతీయ లోక్ అదాలత్‌లో మూడోసారి నెల్లూరుకు ప్రథమ స్థానం – జిల్లా జడ్జి

image

జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 24,972 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి సి.యామిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించిందని లోక్ అదాలత్ కార్యక్రమాలపై నిరంతర దృష్టిపెట్టడంతో నెల్లూరు జిల్లా మూడో సారి రాష్ట్రంలో మొదటి స్థానం దక్కించుకోవడంపై పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 26, 2025

నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

image

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్‌ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 26, 2025

నెల్లూరు జిల్లా ఇలా..

image

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు: నెల్లూరు సిటీ, రూరల్, కావలి, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి
మండలాలు(30):A.సాగరం, AS పేట, ఆత్మకూరు, మర్రిపాడు, సంగం, చేజర్ల, జలదంకి, SRపురం, ఉదయగిరి, V.పాడు, వింజమూరు, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం, బుచ్చి, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, అల్లూరు, కావలి, దగదర్తి, బోగోలు, పొదలకూరు, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, TP గూడూరు, నెల్లూరు సిటీ, రూరల్

News November 26, 2025

నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

image

నెల్లూరు రూరల్‌లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్‌తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.