News March 11, 2025
జాతీయ స్థాయిలో జిల్లా పేరును మార్మోగించిన అరుణ

మాస్టర్స్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ లెవెల్ క్రీడల్లో గూడూరు పాఠశాల ఉపాధ్యాయిని మత్తి అరుణ తన అసామాన్య ప్రతిభను చాటారు. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో 4×400 మీటర్స్ రన్నింగ్లో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్, 4×100 మీటర్స్ రన్నింగ్లో సిల్వర్ మెడల్ను కైవసం చేసుకొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పేరు జాతీయ స్థాయిలో మార్మోగేలా చేశారని తోటి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.
Similar News
News February 13, 2026
కృష్ణా: పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు.!

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన రెండో శనివారం సెలవును జిల్లా విద్యాశాఖ అధికారులు అనూహ్యంగా రద్దు చేశారు. DEO సుబ్బారావు సర్క్యులర్ జారీ చేస్తూ, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పరిధిలోని MEO, DYEOలు తమ తమ మండలాల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందజేశారు.
News February 13, 2026
కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.
News February 13, 2026
కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.


