News October 1, 2024
జాతీయ స్థాయి పోటీలకు పత్తికొండ విద్యార్థి ఎంపిక

పత్తికొండ ఏపీ మోడల్ స్కూలు సీఈసీ రెండో ఏడాది విద్యార్థి బోయ తేజేశ్వర్ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్, పీడీ రాజశేఖర్ నాయక్ తెలిపారు. విద్యార్థిని కళాశాల బృందం అభినందించింది.
Similar News
News December 8, 2025
కర్నూలు: హలో యువత మేలుకో పోస్టర్ విడుదల

కర్నూలు జిల్లాలో యువతలో మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అయ్యప్ప రాష్ట్ర సమితి ముద్రించిన “హలో యువత మేలుకో-చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో” నినాదంతో వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, చాంద్ బాషా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంటి, దస్తగిరి పాల్గొన్నారు.
News December 8, 2025
నకిలీ కాల్స్కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.
News December 8, 2025
నకిలీ కాల్స్కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.


