News January 28, 2025
జాతీయ స్థాయి పోటీలకు సిద్దిపేట బిడ్డ

38వ జాతీయ స్థాయి ఉమెన్స్ రోడ్ సైకిల్ గేమ్స్కు సిద్దిపేట ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న కే.స్నేహ ఎంపికైనట్లు శిక్షకులు సంజీవ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉత్తరాఖండ్లో జరగనున్న పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక్కడ సెంటర్లో శిక్షణ పొందుతున్న వారికి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటే జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణిస్తారన్నారు.
Similar News
News November 2, 2025
కామారెడ్డి: మదన్ మోహన్కు లోకల్ బాడీ అదనపు కలెక్టర్ బాధ్యతలు

కామారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్ను ఇన్ఛార్జి లోకల్ బాడీ అదనపు కలెక్టర్గా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నియమించారు. శనివారం మదన్ మోహన్ బాధ్యతలు స్వీకరించి కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News November 2, 2025
కరువు మండలాల జాబితా విడుదల

AP: 2025 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం కరువు మండలాల జాబితా విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 3 జిల్లాల్లోని 37 మండలాలను ఈ కోవకు చెందినవిగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 మండలాలు కరువు బారిన పడినట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఆ పరిస్థితులు లేవని నివేదికలొచ్చినట్లు పేర్కొంది.
News November 2, 2025
నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(ఫొటోలో) జననం
✒ 1995: హీరోయిన్ నివేదా థామస్ జననం
✒ 2000: ISSలో ఆస్ట్రోనాట్స్ నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం


