News January 19, 2025
జాన్పహడ్ సైదన్న జాతరకు వేళాయే

మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్పహడ్ దర్గా. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు జాన్పహడ్ దర్గా ఉర్సు జరుగనున్నాయి. AP, TG నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉర్సులో పాల్గొని సైదన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు.
Similar News
News December 12, 2025
కోమటిరెడ్డి స్వగ్రామంలో విజయం ఈయనదే..

నార్కట్ పల్లి మండలం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన చిరుమర్తి ధర్మయ్య విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన బుర్రి రాములుపై 779 ఓట్ల తేడాతో ధర్మయ్య విజయం సాధించారు. బుర్రి రాములు విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బ్రాహ్మణ వెల్లంల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వగ్రామం.
News December 11, 2025
హైదరాబాద్ జట్టును ఓడించిన నల్గొండ టీం

వనపర్తిలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ బాలుర పోటీలలో నల్గొండ జిల్లా జట్టు ఫైనల్స్కు చేరుకుంది. సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టును 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో నల్గొండ జట్టు మహబూబ్నగర్ జట్టుతో తలపడనుంది. జట్టు ప్రదర్శన పట్ల కార్యదర్శి విమల, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేశారు.
News December 11, 2025
MGUకి 500 కోట్లు మంజూరు చేయాలని విద్యార్థుల డిమాండ్

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్లు మంజూరు చేయాలని గురువారం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం ప్రకటించిన 1000 కోట్లు స్వాగతించదగ్గదేనిగానీ, ఎంజియు 20 ఏళ్లుగా పీజీ సెంటర్ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. సిబ్బంది కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుర్దశ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల భారీ ఫీజులు, పరిశోధనలో వెనుకబాటు సమస్యలను పరిష్కరించాలని అన్నారు.


