News January 19, 2025

జాన్‌పహడ్ సైదన్న జాతరకు వేళాయే

image

మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్‌పహడ్ దర్గా. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు జాన్‌పహడ్ దర్గా ఉర్సు జరుగనున్నాయి. AP, TG నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉర్సులో పాల్గొని సైదన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు.

Similar News

News December 21, 2025

NLG: రికార్డ్.. ఒక్కరోజే 56,734 కేసుల పరిష్కారం

image

నల్గొండ జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 56,734 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన 16 బెంచీల ద్వారా పెండింగ్‌, ప్రి-లిటిగేషన్‌ కేసులను కొలిక్కి తెచ్చారు. ఇందులో భాగంగా బాధితులకు రూ.4.93 కోట్ల బీమా సొమ్ము, బ్యాంకు రుణాల కింద రూ. 37.76 లక్షలు, సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో రూ. 2.73 లక్షల రికవరీ ఇప్పించారు.

News December 21, 2025

ఎలక్షన్ ఎఫెక్ట్.. మంద కొడిగానే బియ్యం పంపిణీ..!

image

జిల్లాలో రేషన్ బియ్యం విక్రయాలు డిసెంబర్ మాసంలో మందకొడిగా సాగాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ప్రభావం ప్రజా పంపిణీ కేంద్రాలపై పడింది. పల్లె పోరులో చాలా బిజీగా ఉన్న లబ్ధిదారులు రేషన్ దుకాణాల వంక చూడకపోవడంతో ఆయా దుకాణాలలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. 23 మండలాల్లో బియ్యం పంపిణీ 35 శాతానికి మించలేదు. దీంతో మరో రెండు మూడు రోజులపాటు సరఫరా చేయనున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.

News December 21, 2025

NLG: బిల్లులు వచ్చేనా.. ఇక్కట్లు తొలిగేనా?!

image

రెండేళ్ల నుంచి గ్రామపంచాయతీలలో బిల్లులు పెండింగ్లో ఉండడంతో గ్రామ కార్యదర్శులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్ల నుంచి గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో పైఅధికారుల సూచన మేరకు తామే వివిధ అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో పనులు చేయించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నామని తెలిపారు. రెండేళ్ల నుంచి బిల్లులు పెండింగ్లోనే ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.