News April 9, 2025

జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: వరంగల్ కలెక్టర్

image

ఈనెల 11న వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్‌లో జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈనెల 11న ఉదయం 9:30 గంటల నుంచి జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై నిర్వాహ‌కులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.

Similar News

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News November 26, 2025

స్టేట్ ఛాంపియన్స్‌గా ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు

image

మదనపల్లి హైస్కూల్‌లో నవంబర్ 24, 25, 26 తేదీలలో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి SGFI అండర్-14 బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలికల జట్టు రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది. బుధవారం నూజివీడులో సీనియర్ పీడీ వాకా నాగరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. బాలుర జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుందని తెలిపారు. విజేతలైన బాలబాలికలను ఆయన అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలన్నారు.

News November 26, 2025

సిరిసిల్ల: ‘అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం’

image

అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామని బెటాలియన్ అసిస్టెంట్ కమాండెడ్ రామదాసు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్ లో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ.. మన దేశ రాజ్యాంగానికి నేటి రోజున ఆమోద ముద్ర పడిందన్నారు. రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని గుర్తు చేశారు.