News January 24, 2025

జావెలిన్ త్రోలో మెరిసిన సిద్దిపేట బిడ్డ

image

హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో గురువారం జరిగిన స్టేట్ లెవెల్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో సిద్దిపేట తడ్కపల్లికి చెందిన అంబటి రాజు గౌడ్ మొదటి స్థానం సాధించాడు. దీంతో మార్చిలో ఢిల్లీలో జరగబోయే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. రాజుగౌడ్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈఓగా పనిచేస్తున్నారు.

Similar News

News November 5, 2025

పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

image

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

News November 5, 2025

కార్తీక పౌర్ణమి.. వెలుగు జిలుగుల్లో కాశీ

image

దేశంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కాశీ పుణ్యక్షేత్రం దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. గంగా నది ఒడ్డున కాశీ ఘాట్‌ను వేలాది విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.

News November 5, 2025

MDK: వెన్నెల వెలుగుల్లో వనదుర్గమ్మ ❤️

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద కార్తీక పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో వనదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఒకే ఫ్రేమ్‌లోకి చంద్రుడు, ఆలయం, అమ్మవారి విగ్రహం రావడంతో ఈ సుందర దృశ్యాన్ని భక్తులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.