News January 25, 2025
జిత్తు కోసం ప్రత్యేక టీం దింపుతాం: సీఐ రమేశ్

యాదగిరిగుట్టలో జై భవాని జ్యువెలరీ యజమాని జిత్తు సుమారు రూ. 10 కోట్ల నగదు, బంగారంతో ఉడాయించినట్లు తెలుస్తోంది. జిత్తు ది గుజరాత్ కాగా.. బాధితులంతా తాము కుదువపెట్టిన బంగారం రసీదులతో పాటు నగదు రసీదులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు. జిత్తు కోసం ప్రత్యేక టీంను రంగంలోకి దింపి బాధితులకు న్యాయం చేస్తామన్నారు
Similar News
News November 10, 2025
అందెశ్రీ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతం ప్రజల్లో స్ఫూర్తి నింపిందని గుర్తుచేశారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. మంత్రి అందెశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
News November 10, 2025
నల్గొండ: రూ.549కే రూ.10 లక్షల బీమా

నల్గొండ డివిజన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 18 నుంచి 65 సం.ల వారికి అత్యంత తక్కువ ప్రీమియంతో గ్రూప్ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సభవింస్తే కేవలం రూ.549 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కవరేజ్ పొందే విధంగా ప్లాన్ తెచ్చింది. ఈ అవకాశం IPPB ఖాతాదారులకు మాత్రమేనని, వివరాల కోసం పోస్టాఫీసును సంప్రదించాలని అధికారులు కోరారు.
News November 10, 2025
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


