News January 25, 2025
జిత్తు కోసం ప్రత్యేక టీం దింపుతాం: సీఐ రమేశ్

యాదగిరిగుట్టలో జై భవాని జ్యువెలరీ యజమాని జిత్తు సుమారు రూ. 10 కోట్ల నగదు, బంగారంతో ఉడాయించినట్లు తెలుస్తోంది. జిత్తు ది గుజరాత్ కాగా.. బాధితులంతా తాము కుదువపెట్టిన బంగారం రసీదులతో పాటు నగదు రసీదులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు. జిత్తు కోసం ప్రత్యేక టీంను రంగంలోకి దింపి బాధితులకు న్యాయం చేస్తామన్నారు
Similar News
News November 12, 2025
SRCL: డంపింగ్ యార్డ్ను పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. కంపోస్ట్ షెడ్ను పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
News November 12, 2025
సిరిసిల్ల: ‘రైతు బజార్లోనే విక్రయాలు జరగాలి’

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్ను బుధవారం పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, పాల్గొన్నారు.
News November 12, 2025
SRCL: ‘కొత్తచెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి’

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇన్చార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. చెరువు కట్టపైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు.


