News January 25, 2025

జిత్తు కోసం ప్రత్యేక టీం దింపుతాం: సీఐ రమేశ్

image

యాదగిరిగుట్టలో జై భవాని జ్యువెలరీ యజమాని జిత్తు సుమారు రూ. 10 కోట్ల నగదు, బంగారంతో ఉడాయించినట్లు తెలుస్తోంది. జిత్తు ది గుజరాత్ కాగా.. బాధితులంతా తాము కుదువపెట్టిన బంగారం రసీదులతో పాటు నగదు రసీదులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు. జిత్తు కోసం ప్రత్యేక టీంను రంగంలోకి దింపి బాధితులకు న్యాయం చేస్తామన్నారు

Similar News

News November 10, 2025

సంగారెడ్డి: సమస్యలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు: ఎస్పీ

image

ఎలాంటి సమస్యల ఉన్న నేరుగా ఎస్పీ కార్యాలయంలో తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ల ఎస్ఐలను ఆదేశించారు.

News November 10, 2025

అనకాపల్లి పీజీఆర్ఎస్‌లో 239 అర్జీలు

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. అలాగే అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమస్యలు పరిష్కారం అవ్వకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. సమస్యలపై 239 అర్జీలను ప్రజలు సమర్పించారు.

News November 10, 2025

అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి: మోదీ

image

ప్రముఖ రచయిత <<18246561>>అందెశ్రీ<<>> మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. ‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన.. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉంది’ అని పేర్కొన్నారు.