News December 21, 2024

జియ్యమ్మవలస: ఆ ఇంట విషాదం వర్ణనాతీతం

image

పొలం పనులకు వెళ్లిన అన్నదమ్ములు <<14944957>>కరెంట్ షాక్‌తో మృతి<<>> చెందిన ఘటన జియమ్మవలస మండలం శిఖబడిలో చోటుచేసుకుంది. గ్రామానికి శ్రీనివాసరావు, సింహాచలం శనివారం సాయంత్రం నీరు కట్టడానికి వెళ్లి వారు విగతజీవులయ్యారు. మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో ఏడాది క్రితం పాముకాటుతో పెద్దన్నయ్య మృతి చెందాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ మృతి చెందడంతో ఆ ఇంటికి మగ దిక్కు లేకుండా పోయిందని కుటుంబ సభ్యుల రోదిస్తున్నారు.

Similar News

News November 17, 2025

విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు: మంత్రి

image

రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలను, 261 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెల్లింపులు 48 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ 8978975284 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

News November 16, 2025

1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

అర్జీదారులు ‘మీ కోసం కాల్ సెంటర్ 1100’ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

News November 16, 2025

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా చూసుకోవాలి: డా.వెంకటాచలం

image

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహారాజా సర్వజన ఆసుపత్రి డెర్మటాలజీ హెచ్ఓడీ డా.వెంకటాచలం ఆదివారం తెలిపారు. శరీరం పొడిబారకుండా చూసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగకూడదన్నారు. స్నానం చేసిన వెంటనే గ్లిజరిన్ ఆయిల్ లేదా కొబ్బరినూనె రాసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.