News December 21, 2024

జియ్యమ్మవలస: ఆ ఇంట విషాదం వర్ణనాతీతం

image

పొలం పనులకు వెళ్లిన అన్నదమ్ములు <<14944957>>కరెంట్ షాక్‌తో మృతి<<>> చెందిన ఘటన జియమ్మవలస మండలం శిఖబడిలో చోటుచేసుకుంది. గ్రామానికి శ్రీనివాసరావు, సింహాచలం శనివారం సాయంత్రం నీరు కట్టడానికి వెళ్లి వారు విగతజీవులయ్యారు. మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో ఏడాది క్రితం పాముకాటుతో పెద్దన్నయ్య మృతి చెందాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ మృతి చెందడంతో ఆ ఇంటికి మగ దిక్కు లేకుండా పోయిందని కుటుంబ సభ్యుల రోదిస్తున్నారు.

Similar News

News November 18, 2025

విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

image

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

News November 18, 2025

విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

image

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

News November 18, 2025

మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలు అందించండి: VZM SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘ఓ ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోమ్‌లకు తరలించి చికిత్స అందించనున్నట్లు చెప్పారు.