News March 24, 2025

జియ్యమ్మవలస: ఏనుగుల గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలంలోని ఎరుకుల పేట గ్రామ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం చెరుకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణం చేయాలన్నారు. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

Similar News

News December 18, 2025

‘బ్రహ్మపుత్ర’పై చైనా డ్యామ్‌.. భారత్‌కు ముప్పు!

image

యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై $168B (సుమారు రూ.1,51,860CR)తో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నది కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది. సుమారు 2KM ఎత్తును ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల నది సహజ ప్రవాహం మారే ప్రమాదం ఉంది. దీంతో వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశముంది. అలాగే భవిష్యత్తులో నీటిని ఆయుధంగానూ ఉపయోగించే ప్రమాదముంది.

News December 18, 2025

ఖమ్మం: మూడో దశ పోరులో పైచేయి ఎవరిదంటే?

image

● సత్తుపల్లి(21 స్థానాలు): CON- 16, BRS- 4, TDP- 1
● ఏన్కూర్(20): CON- 16, BRS- 3, ఇతరులు- 1
● తల్లాడ(27): CON- 19, BRS- 6, CPM- 1, ఇతరులు- 1
● కల్లూరు(23): CON- 8, BRS- 11, ఇతరులు- 4
● సింగరేణి(41): CON- 32, BRS- 2, CPI- 1, ఇతరులు- 6
● పెనుబల్లి(32): CON- 23, BRS- 8, ఇతరులు- 1
● వేంసూరు(26): CON- 15, BRS- 10, CPM- 1.

News December 18, 2025

పరిషత్ పోరుకు ‘ఓడిన’ అభ్యర్థులు ‘సై’..!

image

గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం ముగియడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పుడే పరిషత్ సెగ మొదలైంది. పంచాయతీ పోరులో చేదు అనుభవం ఎదురైన అభ్యర్థులు ఇప్పుడు MPTC, ZPTC స్థానాలపై కన్నేశారు. త్వరలోనే ఈ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంతో ఉమ్మడి జిల్లాలోని 556 ఎంపీటీసీ, 66 జడ్పీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. గ్రామీణ రాజకీయాల్లో పట్టు నిలుపుకునేందుకు ఇప్పట్నుంచే రంగంలోకి దిగుతున్నారు.