News April 3, 2025

జియ్యమ్మవలస మండలంలో ఏనుగులు గుంపు సంచారం

image

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. కురుపాం నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం ఉదయం కూడా జియ్యమ్మవలస నిమ్మలపాడు ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News September 17, 2025

శుభ సమయం (17-09-2025) బుధవారం

image

✒ తిథి: బహుళ ఏకాదశి రా.1.25 వరకు
✒ నక్షత్రం: పునర్వసు ఉ.9.43 వరకు
✒ శుభ సమయములు: ఉ.9.45-ఉ.10-08, సా.7.10-సా.7.40
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: సా.5.29-సా.7.02
✒ అమృత ఘడియలు: ఉ.7.24-ఉ.8.56

News September 17, 2025

సిద్దిపేట: ‘RTI-2005ను పకడ్బందీగా అమలు చేయాలి’

image

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం-2005 పై పీఐఓలకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లతో కలసి పాల్గొన్నారు. ఆర్టీఐ దరఖాస్తులను సకాలంలో డిస్పోస్ చేయాలన్నారు.

News September 17, 2025

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

KNR జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు “CCTV & హౌస్ వైరింగ్”పై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 18 నుంచి 45 సంవత్సరాలవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9849411002 నంబర్‌ను సంప్రదించవచ్చు.