News February 2, 2025
జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం: MP

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి, జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాఘురాం రెడ్డి అన్నారు. నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడంలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నేషనల్ హైవేలు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్పై ప్రస్తావించలేదన్నారు.
Similar News
News October 23, 2025
ఖమ్మం: పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు

కార్తీక మాసం సందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈనెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1040గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666ను సంప్రదించవచ్చు.
News October 22, 2025
ఖమ్మం: EVERY CHILD READS ప్రారంభం

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో EVERY CHILD READS కార్యక్రమాన్ని నెల రోజుల పాటు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 1–5 తరగతి విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంటసేపు కేటాయించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అక్షరాలు, పదాలు, పేరాలు అర్థం చేసుకునే స్థాయికి చేరేలా చేయాలన్నారు.
News October 22, 2025
ఖమ్మం: రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ అమలు చేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 8వ జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి పాల్గొన్నారు.