News March 19, 2025
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయండి: తిరుపతి కలెక్టర్

తిరుపతి జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను.. పర్యాటక, అటవీశాఖ అధికారులు సమన్వయంతో అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, DFO వివేక్తో కలసి సమీక్షించారు. ఎర్రచందనం మొక్కలు జియో ట్యాగింగ్ తదితర అంశాల గురించి చర్చించారు. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించారు
Similar News
News April 18, 2025
ముంబై అదిరిపోయే గేమ్ ప్లాన్.. ఫ్యాన్స్ ఖుషీ

SRHపై నిన్న MI చక్కటి గేమ్ ప్లాన్ అమలు చేసి గెలిచిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పరుగుల వరద పారే వాంఖడేలో బౌలర్లు యార్కర్లు, స్టంప్స్ను అటాక్ చేస్తూ, స్లో బాల్స్ వేశారని అంటున్నారు. ఆపై కెప్టెన్ హార్దిక్ బౌలర్లను బాగా రొటేట్ చేశారని, దీంతో SRH తక్కువ స్కోరుకే పరిమితమైందని SMలో పోస్టులు పెడుతున్నారు. చాహర్, హార్దిక్ 40+ రన్స్ ఇవ్వడం మినహా మ్యాచ్ను MI వన్ సైడ్ చేసిందని చెబుతున్నారు.
News April 18, 2025
ALERT: నేడు పిడుగులతో వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలోని 83 మండలాల్లో వడగాలులు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది.
News April 18, 2025
విధుల పట్ల శ్రద్ధ వహించాలి: సంగారెడ్డి ఎస్పీ

పోలీసు సిబ్బంది విధుల్లో పూర్తి నిబద్ధతతో పనిచేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. సంగారెడ్డిలోని పోలీసు కార్యాలయంలో ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ డివైస్పై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ తమ విధుల పట్ల శ్రద్ధ వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ పింకీ కుమారి ఉన్నారు.