News February 15, 2025
జిల్లాను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలి: కడప కలెక్టర్

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర సాధనలో భాగంగా జిల్లాలోని గ్రామాలు, పట్టణాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రతి నెలా 3వ శనివారం చేపట్టే “స్వచ్ఛ దివస్” కార్యాచరణపై వీసి ద్వారా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో, ఇళ్లలో “స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని విధిగా, బాధ్యతగా నిర్వహించాలన్నారు.
Similar News
News March 27, 2025
ప్రొద్దుటూరు: 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు

ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన విద్యార్థి 32 ఫేక్ ఇన్స్టాగ్రాం అకౌంట్లతో తన క్లాస్ అమ్మాయిలను వేధించాడు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థిని హెచ్చరించారు. తమ బిడ్డనే మందలిస్తారంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారితో పాటు మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది.
News March 27, 2025
ఏప్రిల్ 3న వైవీయూలో ఉద్యోగ రిక్రూట్మెంట్ డ్రైవ్

కడప: వైవీయూలో ఏప్రిల్ 3వ తేదీన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. కులసచివులు పద్మ, ఉద్యోగ డ్రైవ్కి సంబంధించిన పోస్టర్ను వైవీయూలో విడుదల చేశారు. ప్రముఖ MNC కంపెనీ బయోకాన్ ప్రతినిధులు వైవీయూకు రానున్నారని తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా – కెమికల్, బీటెక్- కెమికల్ అర్హతలు ఉండాలన్నారు.
News March 27, 2025
మత సంప్రదాయాలను గౌరవిస్తూ పండగలు జరుపుకోవాలి: జేసీ

మత సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తి భావంతో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను నిర్వహించుకునేలా జిల్లా శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగల నిర్వహణపై జేసీ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశలో డీఆర్వో, ఆర్డీవో, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.