News March 28, 2025

జిల్లాలో ఉగాది పురస్కారాలకు 11 మంది ఎంపిక

image

ఏలూరు జిల్లాలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు విశిష్టమైన సేవలు అందించి ఉగాది పురస్కారాలకు ఎంపికైన పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అభినందనలు తెలిపారు. జిల్లాలో 11 మంది ఈ ఉగాది పురస్కారానికి ఎంపికైనట్లు తెలిపారు. అవార్డులు, పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.

Similar News

News January 3, 2026

సిరిసిల్ల: నారుమడులపై చలి ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

image

యాసంగి సాగుకు అధిక చలి, మంచుతో నారుమడులపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలితో పాటు సూర్యరశ్మి లేకుండా దట్టమైన పొగ మంచు ఉండడంతో నారుమల్లు ఎదగడం లేదు. సిరిసిల్ల జిల్లాలోని అధిక గ్రామాల్లో నారుమల్లు పోసిన 25 రోజుల తర్వాత నాట్లు వేసేవారు. కానీ, 35 రోజులు దాటినా నాట్లు వేయలేని దుస్థితి నెలకొంది. నాట్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News January 3, 2026

సిరిసిల్ల : ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

image

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ రంగానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా గుర్తించిన విషయం తెలిసిందే.

News January 3, 2026

అభ్యర్థులకు ‘టెట్‌’ తిప్పలు.. ఖమ్మం, హైదరాబాద్‌లో సెంటర్లు!

image

జగిత్యాల జిల్లాలో టెట్ అభ్యర్థులకు సొంత జిల్లాలో కాకుండా ఖమ్మం, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో వేయడంతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు సార్లు కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం కూడా సెంటర్ చాలా దూరం ఉండటంతో ముఖ్యంగా మహిళలు పరీక్షలకు గైర్హాజరు అవుతున్నారు. టెట్ ఫీజు 1000/- చెల్లించి అంత దూరం వెళ్లలేక మానుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో KNR, JGTL, PDPL సెంటర్లు ఉండగా అక్కడ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.