News April 2, 2025

జిల్లాలో ఉత్పాదకత పెరగాలి: కలెక్టర్ దినేష్

image

వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి సాధించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. అన్ని రంగాల్లో జిల్లాలో ఉత్పాదకత పెరగాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. రైతులకు సేంద్రీయ వ్యసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో 104 చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. 5,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాఫీ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

Similar News

News November 27, 2025

విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంచాలి: భూపాలపల్లి కలెక్టర్

image

విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తిని పెంపొందించడంతోపాటు నాణ్యమైన విజ్ఞాన విద్యను అందించేందుకు ప్రథం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. విద్యార్థులకు సైన్స్ అంశాలపై అవగాహన పెంచేలా ఆన్‌లైన్ వీడియోలు, టీచర్లకు ప్రత్యేక గైడెన్స్, స్టెమ్ బోధన అలాగే ఫౌండేషన్ అందించే సామగ్రి అన్ని పాఠశాలలకు చేరాలన్నారు.

News November 27, 2025

తిరుమల: 4.63 లక్షల డిప్ రిజిస్ట్రేషన్లు

image

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన డిప్ రిజిస్ట్రేషన్‌కు రికార్డు స్థాయిలో భక్తులు స్పందించారు. తొలి గంటలోనే 2.16 లక్షలు నమోదు కాగా, సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 4,63,111 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి. డిసెంబర్ 2వ తేదీన ఈ-డిప్‌లో టోకెన్ పొందిన భక్తులకు ఫోన్ ద్వారా సందేశం వస్తుంది.

News November 27, 2025

జనగామ: మొదటి రోజు 44 వార్డు స్థానాలకు నామినేషన్ల దాఖలు

image

జనగామ జిల్లాలో మొదటి విడతలో భాగంగా చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథ్‌పల్లి, జాఫర్‌గఢ్, లింగాల గణపురం 5 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. చిల్పూర్-10, స్టేషన్ ఘనపూర్-7, రఘునాథ్‌పల్లి-8, జాఫర్‌గఢ్-8, లింగాల గణపురం-11 వార్డ్ స్థానాలకు నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 44 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు.