News March 20, 2025
జిల్లాలో కాస్త తగ్గిన ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. గడచిన 24 గంటల్లో భీమారంలో 39.3℃, రాయికల్ 39.3, మల్లాపూర్ 39.2, గొల్లపల్లె 38.7, సారంగాపూర్ 38.4, మేడిపల్లి 38.3, జగిత్యాల 38.3, కథలాపూర్ 38.2, వెల్గటూర్ 38.2, పెగడపల్లె 37.9, జైన 37.7, సిరికొండ 37.6, రాయికల్ 37.5, జగ్గసాగర్ 37.4, మారేడుపల్లి 37.3, కోరుట్ల 37.3, మల్యాలలో 36.9, నేరెల్లా 36.9, మల్లాపూర్లో 36.6 ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News November 26, 2025
అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలి: ఎస్పీ

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కులు, కర్తవ్యాలు, రాజ్యాంగం విలువలు తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
News November 26, 2025
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చనిపోయారా?

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ను చూసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జైలు బయట PTI మద్దతుదారులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై దాడి చేశారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు.


