News October 18, 2024
జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ వద్ద జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి టూరిజం అధికారులతో జిల్లా టూరిజం అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలను ఆహ్లాదకరంగా ఉంచేందుకు బోటింగ్, వాటర్ ఫాల్స్, జిప్ రైడర్, రోబోటిక్ ఫౌంటైన్స్, తదితరాల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. పర్యాటకం అభివృద్ధికి తీరప్రాంతంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులను గుర్తించాలన్నారు.
Similar News
News December 4, 2025
ప.గోలో డీడీఓ కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభించినున్న పవన్

ప.గో. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన డిటిఓ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్గా గురువారం ప్రారంభిస్తారని గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధి అధికారి దోసిరెడ్డి తెలిపారు. డి ఎల్డీఓలను, డీడీవోలుగా కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. ఇందులో జిల్లాలోని విస్సాకోడేరు, నరసాపురం, తాడేపల్లిగూడెం డి డి ఓ కార్యాలయాలు ప్రారంభిస్తారు అన్నారు.
News December 4, 2025
ప.గో: ఈ నెల 14 వరకే ఛాన్స్

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ(పీఎంఏవైజీ) పథకం ప్రారంభించింది. వీటి దరఖాస్తుల గడువు ఇటీవల ముగియగా..లబ్ధిదారుల దృష్ట్యా ఈ నెల 14వరకు పొడిగించింది. గతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారి వివరాలను ఆన్లైన్లో తొలగించి..కొత్తగా అవకాశం కల్పించనుంది. ఇంటి ఏర్పాటుకు రూ.2.50 లక్షల రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి.
News December 4, 2025
పాలకొల్లు: మహిళ హత్య కేసులో..నిందితుడు అరెస్టు

పాలకొల్లులో ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు..పాలకొల్లు టిడ్కో ఇంటిని అద్దె తీసుకుని రాధ అనే మహిళతో సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో రాధతో గొడవ పడి టిట్కో భవనం మేడపైకి తీసుకెళ్లి..తోసేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కుమారై భవ్యశ్రీ ఫిర్యాదుతో సుధాకర్ను అరెస్టు చేశామని ఎస్సై పృథ్వీ తెలిపారు.


