News March 3, 2025

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా గృహాలకు సరఫరా అవుతున్న తాగునీటికి సంబంధించిన పైపులైన్లను తనిఖీ చేయాలని సూచించారు. వచ్చే మూడు నెలలు మంచినీటి ప్రణాళికలను తయారు చేసుకోవలన్నారు.

Similar News

News March 4, 2025

పిఠాపురం: 14న జనసేనలోకి పెండెం దొరబాబు?

image

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుటుంబ సమేతంగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు పవన్ సముఖంగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన జనసేనలో ఎప్పుడు చేరుతారనేది పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారింది. దొరబాబు అనుచరులతో పెద్ద ఎత్తున పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ చేరుతారని సమాచారం. దీనిపై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

News March 4, 2025

సంగారెడ్డి: 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే

image

మంజీర నదిలో యువకుడి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. నాగల్‌గిద్ద మండలం కరస్ గుత్తికి చెందిన సునీల్ చౌహాన్(23) కొన్ని రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన సునీల్ తిరిగి రాలేదు. హద్నూర్ పోలీసులు రాఘవపూర్ శివారులో మంజీర నది బ్రిడ్జిపై అతడి బైక్ గుర్తించారు. నదిలో నిన్న సునీల్ మృతదేహం దొరికింది. ఈనెల 26న సునీల్ పెళ్లి జరగాల్సి ఉంది.

News March 4, 2025

గతంలో తిరిగిన దారుల్లోనే పులి మరోసారి సంచారం!

image

గత 20 రోజులకు పైగా పెద్దపులి సంచారం కలవర పెడుతోంది. కాటారం మండలంలోని గుండ్రాత్‌పల్లి అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నస్తూర్‌పల్లి అడవుల్లో సంచరించిన పులి.. అన్నారం అడవుల మీదుగా గుండ్రాత్‌పల్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ స్వాతి, పలువురు అధికారులతో కలిసి అడవిలో పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి గతంలో తిరిగిన దారుల్లోనే తిరుగుతోంది.

error: Content is protected !!