News June 26, 2024
జిల్లాలో పెరగనున్న సన్న రకం వరి

ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సన్నరకం వరి సాగు గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే రైతులు సన్నరకం వరి విత్తనాలను కొనుగోలు చేసి నార్లు పోసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతుల్లో ఉత్సాహం నిండింది. అంతేకాక మిల్లర్లు, వ్యాపారులు సైతం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకే ఆసక్తి కనబరుస్తుండడంతో రైతులు ఆ పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు.
Similar News
News February 19, 2025
ఖమ్మం: పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్: మంత్రి

అడవి జంతువులు, కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ పథకం ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వ్యవసాయశాఖ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పామాయిల్తో పాటు ఇతర పంటలకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను రైతులకు అందించాలని కోరారు. రాష్ట్ర అవసరాలు తీర్చేలా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
News February 19, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News February 19, 2025
భద్రాచలం చెక్పోస్ట్ వద్ద భద్రత పెంపు

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ వద్ద ఉన్న ఉమ్మడి చెక్పోస్ట్ వద్ద మంగళవారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటీవల గంజాయి స్మగ్లర్లు ద్విచక్ర వాహనంతో వాహనాల తనిఖీ చేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ని వేగంగా ఢీకొట్టి పారిపోయాడు. ఇలాంటి ఘటనలు మరోమారు ఉత్పన్నం కాకుండా భద్రాచలం టౌన్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టారు.