News February 19, 2025

జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

image

వేసవి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో సరాసరి 21.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.

Similar News

News March 20, 2025

తూ.గో జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ మృతి

image

తూర్పు గోదావరి జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న అమలాపురం వాసి ఆకుల రాము(62) గురువారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. సినిమా పంపిణీ రంగంలో కోనసీమ ప్రాంతంలో ఏ సినిమా కొనాలన్నా రాముని సంప్రదించిన తరువాతే కొనేవారు. సినిమా రంగానికి ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన మరణంతో కోనసీమ సినిమా రంగానికి తీరనిలోటని సినీనటుడు రమణ లాల్ అన్నారు.

News March 20, 2025

సెంటర్స్ వద్ద 163 BNSS యాక్ట్ అమలు: SP నరసింహ

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. 67 పరీక్షా కేంద్రాలలో 11,912 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని సూచించారు. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలన్నారు.

News March 20, 2025

రోజూ డబ్బు ఇస్తేనే భార్య కాపురం చేస్తానంటోంది: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

image

రోజూ రూ.5,000 ఇస్తేనే భార్య తనతో కాపురం చేస్తానంటోందని బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. WFH జూమ్ కాల్స్ వేళ భార్య కొట్టేదని, ల్యాప్‌టాప్ ముందు డాన్స్ కూడా చేయడంతో జాబ్ పోయిందని తెలిపాడు. 60 ఏళ్లు వచ్చే వరకు పిల్లలు వద్దంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. విడాకులు అడిగితే రూ.45లక్షలు డిమాండ్ చేస్తోందన్నాడు. అయితే మరో పెళ్లి కోసమే భర్త ఇలా ఆరోపిస్తున్నాడని భార్య చెబుతోంది.

error: Content is protected !!