News February 9, 2025
జిల్లాలో ప్రజావాణి రద్దు: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
Similar News
News November 21, 2025
సమాజ నిర్మాణానికి వృద్ధుల అనుభవం కీలకం: KMR కలెక్టర్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని కామారెడ్డిలో నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వయోవృద్ధుల అనుభవం, జ్ఞానం సమాజ నిర్మాణానికి అత్యంత ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. వారికి గౌరవం, ఆరోగ్యం, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వృద్ధులకు క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు మెమెంటోలు అందజేశారు.
News November 21, 2025
పురుషుల జీవితంలో అష్టలక్ష్ములు వీళ్లే..

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధించాలంటే ఆ ఇంట్లో మహిళల కటాక్షం ఎంతో ముఖ్యం. తల్లి (ఆదిలక్ష్మి) నుంచి కూతురు (ధనలక్ష్మి) వరకు, ప్రతి స్త్రీ స్వరూపం అష్టలక్ష్మికి ప్రతిరూపం. వారిని ఎప్పుడూ కష్టపెట్టకుండా వారి అవసరాలను, మనసును గౌరవించి, సంతోషంగా ఉంచడమే నిజమైన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీలను గౌరవిస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.
News November 21, 2025
బెల్లో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

BEL కోట్ద్వారాలో అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఆప్షనల్ ట్రేడ్కు BBA, BBM, BBS అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు స్టైపెండ్ రూ.17,500, ఆప్షనల్ ట్రేడ్కు రూ.12,500 చెల్లిస్తారు.


