News January 17, 2025
జిల్లాలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ దివాస్

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు.
Similar News
News March 1, 2026
తాగునీటి సరఫరాకి ఇబ్బందులు లేకుండా చూడండి: జేసీ

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భీమవరం కార్యాలయంలో నుంచి గూగుల్ మీట్ ద్వారా శనివారం సమీక్షించారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా ఉండేలా నీటి నిల్వలు, పంపింగ్ స్టేషన్లు, పైప్లైన్ మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News February 28, 2026
ఉండి: గ్యాస్ ప్రమాదం ఘటనలో మరో మహిళ మృతి

ఉండి చిక్కాల వీరన్న నగరంలో ఈనెల 24వ తేదీన జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి చెందారు. ఎస్సై నజీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ సర్వీస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో లక్ష్మి (50) గురువారం మృతి చెందింది. ఆమె తల్లి సుబ్బాయమ్మ (70) ఇప్పటికే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు విజయవాడలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
News February 28, 2026
నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.


