News April 8, 2025

జిల్లాలో రూ.14 కోట్లు పెరిగిన రిజిస్ట్రేషన్ ఆదాయం !

image

ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,43,420 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వాటి ద్వారా రూ.412 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇక 2024-25 సంవత్సరంలో 1,40, 845 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వాటి ద్వారా రూ.426 కోట్లు ఆదాయం సమకూరింది.

Similar News

News April 18, 2025

నెల్లూరులోనూ వెయ్యేళ్ల నాటి కట్టడాలు

image

నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. దీనిని క్రీ.శ 7, 8వ శతాబ్దంలోనే సింహపురిని ఏలిన పల్లవ రాజులు దీనిని నిర్మించారు. ఆ తర్వాత రాజరాజనరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు దీనిని అభివృద్ధి చేశారు. 95 అడుగుల పొడవుతో ఆలయ గాలిగోపురం ఉండటం విశేషం. అలాగే ఉదయగిరి కోటకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి కట్టడాలు నెల్లూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నేడు World Heritage Day.

News April 18, 2025

పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య.. కారణమిదేనా?

image

TG: నిన్న మేడ్చల్ (D) గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఆశిష్(7), హర్షిత్(4)కి శ్వాసకోశ సమస్యలు ఉండటంతో ప్రతి 3, 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయాలి. దీంతో తేజస్విని మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ‘మెరుగైన వైద్యానికి భర్త సహకరించట్లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికిరాకుండా పోతోంది. భర్త కోపంతో కసురుకుంటాడు’ అని సూసైడ్ నోట్ రాసింది.

News April 18, 2025

ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

image

 ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

error: Content is protected !!