News July 11, 2024

జిల్లాలో రూ.300 కోట్ల కుంభకోణం: దేవినేని ఉమా

image

రాష్ట్రంలో సెంటు పట్టా పేరుతో వేల కోట్ల రూపాయల సొమ్మును వైసీపీ నాయకులు దోచేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో వైసీపీ నేతలు భారీ అవినీతి దందాకు తెరలేపారని దుయ్యబట్టారు. జిల్లాలో రూ.300 కోట్ల మేర కుంభకోణం జరిగిందన్నారు. పేదలకు స్థలాల కోసం భూసేకరణలో ఇష్టానుసారం రేట్లు పెంచి వైసీపీ నాయకులు పంచుకున్నారని విమర్శించారు.

Similar News

News December 13, 2025

21న మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు స్పెషల్ ట్రైన్

image

అజ్మీర్ ఉరుసు ఉత్సవాలకు వెళ్లేందుకు గాను ఈ నెల 21వ తేదీన మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు ప్రత్యేక ట్రైన్‌ను వేసినట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ 23వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుందన్నారు. 28వ తేదీ అజ్మీర్ నుంచి బయలుదేరి 30వ తేదీ ఉదయం 9.30గంటలకు తిరిగి మచిలీపట్నం చేరుకుంటుందని చెప్పారు.

News December 12, 2025

కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.

News December 12, 2025

దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

image

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.