News April 15, 2025
జిల్లాలో 121 దరఖాస్తులు వచ్చాయి: అనకాపల్లి కలెక్టర్

జిల్లాలో గల పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం ద్వారా 41 పరిశ్రమలకు రైతుల కోసం 121 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటికి రూ.12.91 కోట్ల రాయితీకి కమిటీ ఆమోదం తెలిపిందని అన్నారు.
Similar News
News December 4, 2025
బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
News December 4, 2025
VKB: మైక్రో అబ్జర్వర్లు నిబద్ధతతో పనిచేయాలి: యాస్మిన్ భాష

వికారాబాద్లో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు యాస్మిన్ భాష ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. 594 గ్రామపంచాయతీలకు 98 మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్లు నిబద్దతతో పనిచేసి పోలింగ్ సరైన విధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరిగింది.
News December 4, 2025
రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో

రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు తమ సమస్యలు, సూచనలను 0877-2263261 నంబర్కు ఫోన్ ద్వారా నేరుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్కు తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమం SVBC ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.


