News April 15, 2025

జిల్లాలో 121 దరఖాస్తులు వచ్చాయి: అనకాపల్లి కలెక్టర్

image

జిల్లాలో గల పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం ద్వారా 41 పరిశ్రమలకు రైతుల కోసం 121 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటికి రూ.12.91 కోట్ల రాయితీకి కమిటీ ఆమోదం తెలిపిందని అన్నారు.

Similar News

News April 23, 2025

ఈ నెల 25న గురుకుల ప్రవేశ పరీక్ష: కలెక్టర్ మహేశ్ 

image

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10-12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలు మే 14న విడుదల చేస్తారన్నారు. ఏప్రిల్ 25 మధ్యాహ్నం 2.30-5 గంటల వరకు జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందన్నారు.

News April 23, 2025

NGKL: ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి: సీపీఎం

image

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడికి వ్యతిరేకంగా బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.

News April 23, 2025

PHOTO: పహల్‌గామ్‌లో దాడి చేసింది వీరే

image

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటో బయటకు వచ్చింది. నలుగురు ముష్కరులు కలిసి ఉన్న ఫొటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.

error: Content is protected !!