News March 17, 2025
జిల్లాలో 128 కేంద్రాలు.. 26,497 విద్యార్థులు

పల్నాడు జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు మొత్తం 128 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈవో చంద్రకళ తెలిపారు. ఆ పరీక్షా కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 12,869 మంది రెగ్యులర్ బాలురు, 12,778 మంది రెగ్యులర్ బాలికలు ఉన్నారు.586 మంది ప్రైవేట్ బాలురు,304 మంది బాలికలు ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్నారు. 6గురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు.
Similar News
News November 28, 2025
వనపర్తి: నామినేషన్లలో పొరపాట్లు వద్దు: కలెక్టర్

వనపర్తి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎన్నికల నిబంధనలను జాగ్రత్తగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రెండో, మూడో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


