News February 24, 2025

జిల్లాలో 144వ సెక్షన్ అమలు: భూపాలపల్లి కలెక్టర్

image

ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఈ నెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుంపులుగా ఉండటం, ప్రచారం చేయడం నిషిద్ధమని స్పష్టం చేశారు.

Similar News

News October 24, 2025

రేపు 25న డయల్ యువర్ HNK డీఎం

image

హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరమ్ సింగ్ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు శనివారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో డిపో అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు, సూచనలను ప్రయాణికులు 89777 81103కు ఫోన్ చేసి అందించాలని కోరారు.

News October 24, 2025

చెక్ పోస్టులను సందర్శించిన ఎస్పీ మాధవ్ రెడ్డి

image

ఎల్విన్ పేట, బత్తిలి పోలీసు స్టేషను పరిధిలోని చెక్ పోస్టులను శుక్రవారం మన్యం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను క్షుణంగా పరిశీలించి ప్రతి వాహనాన్ని సక్రమంగా తనిఖీలు నిర్వహించాలని చెక్ పోస్ట్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ హరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News October 24, 2025

నిజాంసాగర్: పెరుగుతున్న వరద.. ఒక గేటు ద్వారా నీటి విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు ఒక వరద గేటును ఎత్తి 5,497 క్యూసెక్కుల నీటిని మంజీరా నదికి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి 5,760 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుండలా మారింది.