News March 19, 2025
జిల్లాలో 9 మంది తహశీల్దార్లు బదిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్లకు మహేశ్ కుమార్, ఎల్లారెడ్డిపేటకు సుజాత, వేములవాడ రూరల్ కు అబూబకార్, వేములవాడకు విజయ ప్రకాష్ రావు, ఈఓ విటీఎడీఎగా భూపతి, డీఏవోగా ఉమరణి, సూపరింటెండెంట్ కలెక్టరేట్గా రామచంద్రం బదిలీ అయ్యారు.
Similar News
News January 11, 2026
KNR: ప్రత్యేక రైలు రేపటి వరకు పొడిగింపు

HYD-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే ఫెస్టివల్ స్పెషల్ రైలును మరో 2 రోజులు పొడిగించారు. ముందుగా ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రత్యేక రైలు నడిపిస్తుండగా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11, 12 తేదీల్లో కూడా నడపిస్తున్నారు. HYD – సిర్పూర్ కాగజ్నగర్(07473) మధ్య 11, 12వ తేదీల్లో ఉ. 7-55 గం.లకు బయలుదేరి మ. 2-15గం.లకు చేరుకుంటుంది. ఉమ్మడి KNRలో ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లో ఆగుతుంది.
News January 11, 2026
మన పల్నాడే పందేం కోళ్లకు అసలైన కేరాఫ్!

కోడి పందేలు అనగానే APలోని ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. అయితే కోడి పందేలు చరిత్ర శతాబ్దాల వెనక్కి వెళ్లితే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాటి వీరగాథ ముందుకొస్తుంది. కోడి పందేలే కారణంగా పల్నాడు యుద్ధంలో రక్తపాతం జరిగింది. సామాజిక విభేదాలు, అధికార పోరాటాలు కోడి పందేల చుట్టూ ముదిరి చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడి పందేలు చరిత్రగా, ఒక రకంగా సంప్రదాయంగా ఉన్నాయి.
News January 11, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ‘దిత్వా’

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండడంతో.. రైతుల్లో భయందోళన మొదలైంది. జిల్లాలో మిర్చి సుమారు 50వేల ఎకరాలపైగా కాతపూత దశలో ఉంది. మొక్కజొన్న లక్షన్నరపైగా ఎకరాల్లో సాగులో ఉంది. వర్షం పడితే మిర్చి, మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. అటు పండుగ సంబురాలకు కూడా వర్షం ఆటంకం కలిగించనుంది.


