News May 10, 2024
జిల్లాలో 94% ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తి: విశాఖ కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమం 94% పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున తెలిపారు. మిగిలిన వారికి ఈరోజు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తామని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఓటర్ స్లిప్ తీసుకోని వారు ఓటర్ జాబితాలో పేరు ఉంటే పోలింగ్ రోజు స్లిప్పు తీసుకుని నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, పోలింగ్ కేంద్రం వద్ద వీటికి ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 2, 2025
రేపటి నుంచి సింహాచలం నృసింహ దీక్షలు ప్రారంభం

సింహాచలంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి నృసింహ దీక్షలు ప్రారంభం కానున్నట్లు ఈవో సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ దీక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత దీక్షలు డిసెంబర్ 3 నుంచి, రెండో విడత దీక్షలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పై తేదీలలో మాల ధరించే భక్తులకు తులసి మాలలు, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
News December 2, 2025
రేపటి నుంచి సింహాచలం నృసింహ దీక్షలు ప్రారంభం

సింహాచలంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి నృసింహ దీక్షలు ప్రారంభం కానున్నట్లు ఈవో సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ దీక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత దీక్షలు డిసెంబర్ 3 నుంచి, రెండో విడత దీక్షలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పై తేదీలలో మాల ధరించే భక్తులకు తులసి మాలలు, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
News December 2, 2025
విశాఖ: ‘మా కొడుకును కోడలే చంపింది’

విశాఖలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే కోడలే తమ కొడుకుని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిశోర్ తల్లి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


