News December 24, 2024

జిల్లాస్థాయి ఆర్డీటీ ఫుట్‌బాల్ విజేతగా లేపాక్షి జట్టు 

image

జిల్లా స్థాయి ఆర్డీటీ ఫుట్‌బాల్ విజేత జట్టుగా లేపాక్షి జట్టు విజేతగా నిలిచింది. ఫుట్‌బాల్ క్లబ్ ఆర్డీటీ అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్ 12 బాలికల పోటీల్లో లేపాక్షి మండల ఫుట్‌బాల్ క్లబ్ విజేతగా నిలిచింది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ లీగ్ పోటీలలో ఫైనల్ రౌండ్‌కు చేరుకొని జిల్లాలోని ఉత్తమ జట్లపై విజయం సాధించి మొదటి స్థానంలో గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News January 14, 2025

రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు: ఎస్పీ

image

రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాదాపుగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. హెల్మెట్/ సీటుబెల్టు ధరించడంతో పాటు త్రిబుల్ రైడింగ్, ఓవర్లోడింగ్, డ్రంకన్ డ్రైవ్, తదితర ఉల్లంఘనలకు దూరంగా ఉండాలన్నారు. మోటారు వాహనాల చట్ట ప్రకారంగా గడిచిన వారం రోజుల్లో 2,881 కేసులు నమోదు చేశామన్నారు.

News January 13, 2025

BREAKING: తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి

image

తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. రోహిత్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.

News January 13, 2025

అనంతపురానికి CM అన్యాయం చేస్తున్నారు: తోపుదుర్తి

image

కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.