News December 5, 2024

జిల్లా అధికారుల పర్యవేక్షణలో రెవెన్యూ సదస్సులు: కలెక్టర్‌

image

రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు విజయవంతానికి జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని కలెక్టర్‌ జి.లక్ష్మిశ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 320 రెవెన్యూ గ్రామపంచాయతీల పరిధితో పాటు, విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, తిరువూరు పట్టణ వార్డు సచివాలయల పరిధిలో కూడా సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Similar News

News January 16, 2025

కృష్ణా: ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా డీసీసీబీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్‌ల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణాజిల్లాలో 66 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను 17 పీఏసీఎస్ ఇన్ సర్వీసుల ఉద్యోగులకు కేటాయించారు. ఈనెల 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

News January 16, 2025

ముగిసిన పందేలు.. చేతులు మారిన వందల కోట్లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్ల పందేలు ముగిశాయి. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతూ పందెంరాయుళ్లు సై అంటే సై అంటూ యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సాగిన పందేల్లో సుమారు రూ.500 కోట్లు చేతులు మారినట్లుగా తెలుస్తోంది.. బుధవారం సాయంత్రంతో పందెం రాయుళ్లకు పోలీసులు పుల్ స్టాప్ పెట్టారు. పటమట కొత్తపేట అంపాపురం బరులను అధికారులు మూసివేశారు.

News January 16, 2025

విజయవాడలో పోలీసులపై దాడి అవాస్తవం: సీఐ

image

విజయవాడ శివారు జక్కంపూడిలో జూద శిబిరాలు ఖాళీ చేయించామని కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. జక్కంపూడిలో పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదని ఎస్ఐ సివిల్ డ్రెస్‌లో ఉండటం వల్ల అక్కడ ఉన్న ఆకతాయిలు గుర్తుపట్టలేదని తెలిపారు. ప్రస్తుతం జూద శిబిరాన్ని ఖాళీ చేయించామని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఐ తెలిపారు. మరల జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.