News April 5, 2025

జిల్లా నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం

image

ఈనెల 27న వరంగల్ వేదికగా BRS పార్టీ ఆవిర్భావం సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం భద్రాద్రి జిల్లా ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రజతోత్సవ వేడుకలపై జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు, హరిప్రియ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 10, 2025

జూబ్లీ బైపోల్: ఓటు వేయడానికి 12 ఆప్షన్లు!

image

జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో IDలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు-పోస్టాఫిస్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN, పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT

News November 10, 2025

సింగపూర్‌ వెళ్లనున్న పాలకొండ టీచర్

image

రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచి, అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తున్న పాలకొండ హైస్కూల్ సంస్కృత ఉపాధ్యాయుడు బి.శంకరరావును ప్రభుత్వం సింగపూర్ పంపిచనుంది. రాష్ర్టంలో మరికొందరు ఉపాధ్యాయులు, మంత్రి లోకేశ్‌తో పాటు అక్కడి ప్రముఖులతో పాఠశాలలో విద్యా విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈనెల 27న ప్రభుత్వం ఉపాధ్యాయులను సింగపూర్ పంపించనుంది. డిసెంబర్ వరకు ఉపాధ్యాయ బృందం ఢిల్లీలో పర్యటించనుంది.

News November 10, 2025

GWL: నూతన డీఎంహెచ్‌ఓగా సంధ్యా కిరణ్మయి

image

గద్వాల నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్‌ జే.సంధ్య కిరణ్మయి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వైద్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సిద్ధప్పతో పాటు సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో హెల్త్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేద్దామని పేర్కొన్నారు.