News April 8, 2025
జిల్లా పోలీస్ PGRSకు 62 అర్జీలు

కాకినాడ జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జి.బిందుమాధవ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో 62 మంది అర్జీదారులు నుంచి ఎస్పీ స్వయంగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి సత్వరమే సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదికారులకు సూచించారు.
Similar News
News April 17, 2025
పాలమూరు యూనివర్సిటీలో సకోర అభియాన్ కార్యక్రమం

సకోర అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేశ్ బాబు పక్షులకు నీటి తొట్లు అందించి జీవారణాన్ని కాపాడాలన్నారు. పీజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వచ్చే ఎండాకాలంలో పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందిస్తూ ప్రాణకోటిపై దయా హృదయంతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు అంతమవడానికి పరోక్షంగా మానవాళి చర్యలే కారణమన్నారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News April 17, 2025
కేంద్ర హోంమంత్రి చేతులు మీదుగా పురస్కారం అందజేత

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే పరేడ్ గురువారం మద్యప్రదేశ్లో జరిగింది. ఈ వేడుకలలో విశాఖకు చెందిన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరాధ్యుల శ్రీనివాస్కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు లభించింది. ఈ అవార్డును శ్రీనివాస్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందజేశారు. 34 ఏళ్లకు పైగా దేశ భద్రతకు ఆయన చేసిన సేవలకి గాను ఈ పురస్కారం లభించింది.
News April 17, 2025
ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సాయంత్రం ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి జోషికి నంద్యాల, కర్నూలు ఎంపీలు బైరెడ్డి శబరి, నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీజీ వెంకటేష్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. పిన్నాపురంలోని గ్రీన్ కో ప్రాజెక్ట్, అహోబిలంలో ఆయన పర్యటించనున్నారు.