News January 10, 2025
జిల్లా వెబ్ సైట్లో అర్హుల జాబితా: కలెక్టర్ ప్రశాంతి
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుకు ఒప్పంద ప్రాతిపదికన పని చేసేందుకు అభ్యర్థుల నుంచి స్వీకరించిన వాటిలో దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హుల తాత్కాలిక జాబితా సిద్ధం చేస్తామని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అధికారిక వెబ్ సైట్ https:///east godavari.ap.gov.in లో ప్రచురించామన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోగా తెలపాలన్నారు.
Similar News
News January 25, 2025
రాజానగరం: హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
రాజానగరంలోని రథేయపాలేనికి చెందిన రాంబాబుకు హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు విధిస్తూ రాజమండ్రి 5వ అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. రాజానగరం సీఐ కథనం.. రాంబాబు 2020లో అదే గ్రామానికి చెందిన వెంకన్నను హత్య చేసి, వెంకన్న బాబును గాయపరిచాడు. ఆ ఘటనకు అప్పటి ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణల అనంతరం శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.
News January 25, 2025
రాజమండ్రి : మహిళను వేధించి హత్యాయత్నం.. జైలు
కాకినాడలోని వాకలపూడి వాసి వెంకన్న (25)కు రాజమండ్రి 8వ జిల్లా సెషన్స్ జడ్జి 9ఏళ్ల జైలు, రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా నిందితుడు ఓ మహిళను లైంగికంగా వేధించి , హత్యాయత్నం చేశాడని 2022లో అప్పటి ఎస్సై వి. మౌనిక కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.
News January 25, 2025
నేడు రాజమండ్రి విమనాశ్రయానికి టెక్నికల్ టీం రాక
రాజమండ్రి ఎయిర్ పోర్ట్లో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో శుక్రవారం మిషనరీ పనులు నిర్వహిస్తుండగా క్రేన్ ద్వారా అమరుస్తున్న పిల్లర్ సెట్టింగ్ జారిపడి విషయం విధితమే. ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి కారణాలను అంచనాలు వేసేందుకు చెన్నై, హైదరాబాద్ టెక్నికల్ టీమ్స్ శనివారం వస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు.