News December 8, 2024

జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ సేవలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 

Similar News

News November 20, 2025

నేరస్థులను ప్రోత్సహించేలా జగన్ తీరు: వర్ల

image

హైదరాబాద్‌లో జగన్ ఆడిన ‘డ్రామా’, నటించిన తీరు వర్ణనాతీతం, చట్ట వ్యతిరేకమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జరిగిన రభస, అలజడి సీబీఐ కోర్టును ప్రభావితం చేసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఒక ముద్దాయి కోర్టుకు వస్తుంటే జనం ఎందుకు రావాలి? జగన్ దేశం కోసం పోరాడిన వ్యక్తి కాదన్నారు.

News November 20, 2025

నేరస్థులను ప్రోత్సహించేలా జగన్ తీరు: వర్ల

image

హైదరాబాద్‌లో జగన్ ఆడిన ‘డ్రామా’, నటించిన తీరు వర్ణనాతీతం, చట్ట వ్యతిరేకమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జరిగిన రభస, అలజడి సీబీఐ కోర్టును ప్రభావితం చేసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఒక ముద్దాయి కోర్టుకు వస్తుంటే జనం ఎందుకు రావాలి? జగన్ దేశం కోసం పోరాడిన వ్యక్తి కాదన్నారు.

News November 20, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

image

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్‌ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్‌లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.