News July 21, 2024

జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు

image

తిరుపతి జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి నిరంతరం ప్రజలతో మమేకమై, నేరస్తులపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. శనివారం జిల్లాలో 54 ప్రదేశాలలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి వాహనదారుడు ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలను కలిగి ఉండాలన్నారు.

Similar News

News December 2, 2025

ఐరాల: మహిళపై చిరుత పులి పిల్లల దాడి

image

ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో మహిళపై చిరుత పులి పిల్లలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు మేరకు.. ఓ మహిళ ఆదివారం సాయంత్రం తన ఆవులను మేతకు తీసుకెళ్లింది. చిరుత పులి పిల్లలు ఆమెపై దాడి చేశాయి. గోళ్లతో గాయం చేశాయి. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నెలలోనే 5ప్రదేశాల్లో చిరుత పులి దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు.

News December 2, 2025

బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

image

పలమనేరులో SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విన్నర్స్‌గా, కడప జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బాలుర విభాగానికి చెందిన ఫైనల్ పోటీల్లో చిత్తూరు, కడప జట్ల మధ్య హోరాహోరీ పోరులో చిత్తూరు బాలురు జట్టు గెలుపొందింది. అదేవిధంగా బాలికల విభాగంలోనూ చిత్తూరు, కడప జట్లు తలపడగా.. కడప జట్టు గెలుపొందినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

News December 2, 2025

బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

image

పలమనేరులో SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విన్నర్స్‌గా, కడప జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బాలుర విభాగానికి చెందిన ఫైనల్ పోటీల్లో చిత్తూరు, కడప జట్ల మధ్య హోరాహోరీ పోరులో చిత్తూరు బాలురు జట్టు గెలుపొందింది. అదేవిధంగా బాలికల విభాగంలోనూ చిత్తూరు, కడప జట్లు తలపడగా.. కడప జట్టు గెలుపొందినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.