News April 4, 2025

జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ: భద్రాద్రి కలెక్టర్

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శుక్రవారం జిల్లా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం తరలించామని తెలిపారు. ఇప్పటికే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా తగు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.

Similar News

News February 23, 2026

ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రభావం

image

గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమతుల్యత చాలా అవసరం అంటున్నారు నిపుణులు. హార్మోన్ల స్థాయిలలో తేడా వస్తే ప్రీమెచ్యూర్ డెలివరీ, బేబీ తక్కువ బరువుతో పుట్టడం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి గర్భిణీ శరీరానికి మాత్రమే కాకుండా శిశువు ఆరోగ్యానికీ ప్రమాదం. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకొని దానికి తగ్గట్లు మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.

News February 23, 2026

శనిదేవుడిని శాసించిన మహా తపస్వి

image

దధీచి మహర్షి కుమారుడే పిప్పలాద మహర్షి. తల్లిదండ్రులు లేకపోవడంతో ఆయన మేనత్త వద్ద పెరిగాడు. తండ్రి మరణానికి ఇంద్రుడడని తెలిసి పగతో రగిలిపోయాడు. శివుడికై తపస్సు చేశాడు. శివుడు అతడిని శాంతింపజేసి అది విధి అని వివరించాడు. ఈయన ప్రశ్న ఉపనిషత్తు రాశారు. శనిదేవుడిని ఓడించి పిన్న వయసులో ఉన్నవారిని ఇబ్బంది పెట్టవద్దని కోరాడు. చిన్నతనంలో ‘పిప్పల’(రావి) చెట్టు పండ్లను తిని జీవించడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది.

News February 23, 2026

వనపర్తి: టెన్త్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

image

మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు వనపర్తి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో 7,228 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.