News January 4, 2025
జిల్లా సమగ్రాభివృద్ధిలో పాత్రికేయుల సహకారం అవసరం: WGL కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735921387986_51243309-normal-WIFI.webp)
జిల్లా సమగ్రాభివృద్ధిలో పాత్రికేయుల సహకారం అవసరమని కలెక్టర్ సత్య శారదా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో పాత్రికేయులతో(ముఖా ముఖి) కార్యక్రమం నిర్వహించారు. పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నారని.. జిల్లాలో ప్రజలు ఎలాంటి సమస్యలకు గురైన పాత్రికేయులు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
Similar News
News January 25, 2025
ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737770142782_51669518-normal-WIFI.webp)
వరంగల్లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు శనివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
News January 25, 2025
మాజీ కౌన్సిలర్ దంపతుల మీద దాడిని ఖండించిన పెద్ది
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737732224443_71668558-normal-WIFI.webp)
నర్సంపేట మాజీ కౌన్సిలర్ వెంకటమ్మ, స్వామి దంపతుల మీద దాడిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రోడ్డు వెడల్పులో భాగంగా వెంకటమ్మ, స్వామి ఇంటి గోడను కూల్చే విషయంలో కుట్ర జరిగిందని ఆరోపించారు. దాడి జరిగే సమయంలో పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదని పెద్ది ఆరోపించారు. కాంగ్రెస్ వారికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని పెద్ది ప్రశ్నించారు.
News January 24, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737724894518_18102126-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం సైతం వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12,500, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది. అలాగే పాత తేజ మిర్చి ధర రూ.14,000, పాత 341 రకం మిర్చి ధర రూ.15,500, పాత వండర్ హాట్ మిర్చి రూ.14,000, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. సూక పల్లికాయ రూ.6,210, పచ్చిపల్లికాయ రూ.4 వేలు పలికాయి.