News March 19, 2025
జి. కొండూరు: వరుసకు కూతురితో అసభ్య ప్రవర్తన

కూతురు వరుసయ్యే బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జి. కొండూరు(M) చెవుటూరులో జరిగింది. విజయవాడకు చెందిన మహిళ భర్తతో విడిపోయింది. కొడుకు, కమార్తెతో వచ్చి రవీంద్రతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పని నుంచి ఇంటికి రాగానే చిన్నారి జరిగిందంతా చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేయగా.. అవమానంతో వ్యక్తి విషం తాగాడు.
Similar News
News April 21, 2025
కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి ఆరోపించారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు కావాలని అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో సన్నాహక సదస్సుకు పాల్గొని మాట్లాడారు.
News April 21, 2025
పదో తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్

AP: పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. రిజల్ట్స్ ఈ నెల 23న (బుధవారం) ఉ.10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్క్స్ లిస్ట్ వస్తుంది. ఒక్క క్లిక్తో షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి యాడ్స్ ఉండవు.
News April 21, 2025
రాజస్థాన్ రాయల్స్పై అంబటి రాయుడు తీవ్ర విమర్శలు

రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లోనూ విఫలం కావడంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రతి సీజన్లోనూ యువ ఆటగాళ్లపై RR పెట్టుబడి పెడుతోంది. IPL అంటే ఛారిటీయా? దాని వల్ల ఏం సాధించింది? పైగా అదేదో తమ బలంలా ఆ జట్టు యాజమాన్యం గొప్పగా చెప్పుకుంటోంది. టోర్నీ ఆడేది కప్పు గెలవడానికే గానీ కొత్త ఆటగాళ్లను తీసుకురావడానికి కాదు. అందుకే RR ట్రోఫీ గెలిచి 17 ఏళ్లయింది’ అని గుర్తుచేశారు.