News December 18, 2024
జీజీహెచ్ అభివృద్ధి అందరి బాధ్యత: కలెక్టర్
కడప జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా సర్వజన ఆసుపత్రిని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. రిమ్స్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రిమ్స్ వైద్య విభాగాధిపతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలోనూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అత్యుత్తమ టీచింగ్ హాస్పిటల్గా పేరు గడించిందన్నారు.
Similar News
News January 25, 2025
YS వివేకా ఘటనపై స్పందించిన విజయసాయిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యపై విజయసాయిరెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని, వెంటనే అవినాశ్ రెడ్డికి ఫోన్ చేయగా పక్కన ఉన్న వ్యక్తికి ఫోన్ ఇచ్చారన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారని, ఫోన్లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.
News January 25, 2025
పులివెందులలో YS జయమ్మ 18వ వర్ధంతి వేడుకలు
పులివెందులలో వైఎస్ జయమ్మ 18వ వర్ధంతి వేడుకలలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని డిగ్రీ కళాశాలలోని జయమ్మ సమాధి వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైయస్ జార్జిరెడ్డి, సతీమణి వైయస్ భారతమ్మ, వైయస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్ సౌభాగ్యమ్మలు నివాళులు అర్పించారు.
News January 25, 2025
కడప జిల్లా కలెక్టర్ను కలిసిన ఎస్పీ అశోక్
కడప జిల్లా నూతన ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ను శుక్రవారం కలిశారు. నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కడప కలెక్టర్ శ్రీధర్ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కలెక్టర్ను అడిగి ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.