News February 2, 2025
జీడిమెట్లలో హార్టికల్చర్పై స్పెషల్ ట్రైనింగ్

తెలంగాణ హార్టికల్చర్ విద్యార్థులకు జీడిమెట్లలో MIA ప్లాంటింగ్, హార్టికల్చర్ సెంటర్లో స్పెషల్ ట్రైనింగ్ అందించినట్లుగా డాక్టర్ సుకుంద తెలిపారు. ఫార్మర్ ట్రైనింగ్ విద్యార్థులకు ఎంతో అవసరమని డాక్టర్ వివరించారు. ప్రస్తుతం అగ్రికల్చర్ రంగంలో విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Similar News
News November 10, 2025
ఖమ్మం రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రమాద భయం

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని ఆరబోయడానికి మార్కెట్ యార్డుల కొరత ఉండటంతో రైతులు పంటను ప్రధాన రహదారులపైనే పోస్తున్నారు. దీంతో వడ్ల రాశులు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయి వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News November 10, 2025
సిద్దిపేట: ప్రతిభకు మారుపేరు అందెశ్రీ !

సిద్దిపేట జిల్లా రేబర్తికి చెందిన ప్రజాకవి అందెశ్రీ ఇక లేరన్న విషయం బాధిస్తోంది. ప్రతిభకు మారుపేరుగా నిలిచిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణ జననీ జయకేతనం, పల్లెనీకు వందనములమ్మో, మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా.. జన జాతరలో మన గీతం, యెల్లిపోతున్నావా తల్లి పాటలు ప్రసిద్ధి చెందాయి.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.


